KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అల్లీపూర్లో అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్లో 41.3°Cగా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2°Cగా నమోదయ్యాయి. ఈ మేరకు ఎండలో బయటకు వెళ్ళవద్దని వైద్యులు సూచిస్తున్నారు.