WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ పోర్టల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్కు ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.