NDL: చాగలమర్రిలోని బుగ్గరస్తాలో గల 5వ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న పద్మావతి (60) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని పలువురు అంగన్వాడీ టీచర్లు శనివారం ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐసీడీఎస్ సీడీపీవో తేజేశ్వరి, సూపర్వైజర్ సుశీల వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.