KRNL: గోనెగండ్లలోని బీసీ కాలనీలో శనివారం ప్రమాదవశాత్తు నిప్పుఅంటుకొని 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.75వేల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు బోయ లక్ష్మి తెలిపారు. గడ్డివాము పై బాగంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. తీగల నుంచి నిప్పరవ్వలు గడ్డి వాములపై పడటంతో వాములు రెండు కాలిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.