WGL: వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు పరీక్షలో జనరల్ మొత్తం 5680 విద్యార్థులకు గాను 5491 హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 767 విద్యార్థులకు గాను 694 హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మలలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు.