KMR: యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి, యూరియాను ప్రత్యక్షంగా సరఫరా చేయాలని కోరుతూ న్యాయ పోరాటం చేసేందుకు ఆయన ఫోరం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై సీనియర్ న్యాయవాది రచనరెడ్డితో చర్చించి, ఆన్లైన్ విధానంలోని సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యల గురించి వివరించారు.