PDPL: కేంద్ర బడ్జెట్ కార్మికులు, కర్షకులు, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. యాకయ్య అన్నారు. మంథనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బడ్జెట్ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు.