PDPL: నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో ఇవాళ ఆయన కలెక్టర్ శ్రీ హర్షతో ఇన్నోవేషన్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే కాకుండా గ్రామాలకు సైతం విస్తరించడం జరుగుతుందన్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేస్తామని పేర్కొన్నారు.