AP: శ్రీవారి లడ్డూ అంశంలో కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ అనంతబాబు తెలిపారు. లడ్డూ నెయ్యి అంశం డైవర్ట్ చేయడానికి తన కేసు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. అన్యాయంగా తన భార్యను కేసులో ఇరికించారని.. న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అధికారులు సహకరిస్తే.. 7 నెలలు జైల్లో ఎందుకు ఉంటానని నిలదీశారు.