AP: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రభావంతో పసుపు ధరలు భారీగా తగ్గాయి. క్వింటాల్ పసుపు ధర రూ.10-12 వేలు పలుకుతుంది. క్వింటాల్కు రూ.15 వేలు పలికితేనే గిట్టుబాటు ధర వస్తుందని అన్నదాతలు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గాయని వాపోయారు. సీజన్కు ముందే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.