AP: తమ ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘రూ.3.5 లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్ధాలు చెబుతున్నారు. అప్పులు ఇవ్వొద్దని వందకు పైగా సంస్థలకు లేఖలు రాశారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి చీవాట్లు తిన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది’ అని విమర్శించారు.