AP: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. తనముందు హాజరై రాజీనామా కారణాలపై వివరణ ఇవ్వాలని తెలిపారు. వారు రాజీనామా పత్రాలు చేసి చాలా రోజులు అయినప్పటికీ ఛైర్మన్ ఆమోదించలేదని వైసీపీ నేతలు మోషేన్ రాజును కలిశారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.