TG: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇవాళ ఎత్తనున్నట్లు SRSP ఏఈఈ రవి తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 0.60 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం అధికారులు విడుదల చేస్తుంటారని పేర్కొన్నారు.