AP: రాయలసీమను రతనాల సీమను చేశామని CM చంద్రబాబు అన్నారు. ’14 వారాలు వెలిగొండకు డెడ్లైన్ పెట్టాం. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్లో పూర్తి చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా..నేనే పూర్తి చేయబోతున్నా. జూలైలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు ఇవ్వబోతున్నాం. 2,500 కోట్ల పనులు పెండింగ్ పెట్టి జాతికి అంకితం అంటూ గత పాలకులు హడావుడి చేశారు’అని అన్నారు.