TG: ఇరాన్లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందరినీ స్వదేశానికి సురక్షితంగా రప్పించాలన్నారు. గల్ఫ్ కార్మికుల కుటంబాలు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పలు విమానసేవలు రద్దు అయిన సంగతి తెలిసిందే.