అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాక్ ఈ దాడులకు పాల్పడటం, ఇందులో మహిళలు, చిన్నారులు సహా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇది తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై రుద్దేందుకు పాక్ చేసిన ప్రయత్నమేనన్నారు.