TPT: విజయవాడకు చెందిన వెలగపూడి విజయలక్ష్మీ కుటుంబ సభ్యులు తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అన్నదానానికి భారీ విరాళం అందజేశారు. దాత శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్టుకు రూ.1.08 కోట్లు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వీకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని అదనపు ఈవో అభినందించారు.