TG: యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, ఎక్కడ ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.