CTR: బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సేవలు, ముఖ్యంగా విద్యా రంగంలో చేసిన కృషి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.