VZM: సమానత్వం విద్య సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడుబాబు అన్నారు. పూలే జయంతి పురస్కరించుకుని జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో, కలెక్టరేట్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, దేవర కిరణ్ పాల్గొన్నారు.