TPT: సాంకేతిక లోపంతో ఇవాళ ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30గంటల నుంచి తిరుమలలో అన్నమయ్య భవన్ సమీపాన ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద 800 టికెట్లను నేరుగా జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలి. రేపటి నుంచి మళ్లీ ఆన్లైన్ ద్వారానే టికెట్లు ఇస్తారు.