సత్యసాయి: కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు బోరు బావి తవ్వించారు. తవ్వకాల్లో సమృద్ధిగా నీరు పడటంతో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామస్థులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాప్తాడు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.