ఏకపాద శీర్షాసనం అనేది యోగాలో కష్టతరమైన, అధునాతనమైన భంగిమ. ఇది తలకిందులుగా ఉంటూ, ఒక కాలును తల వెనుకకు ఉంచే ఆసనం. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది భుజాలు, చేతులు, మెడ, వెన్నెముక కండరాలను బలపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ముఖానికి రక్తప్రసరణ పెరగడం వల్ల ముఖం మీద కాంతి పెరుగుతుంది.