ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని BCCI భావిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ జాబితాలో ఉండటంతో, ఈ మ్యాచ్లో జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, రిషభ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో టీమిండియాను నడిపించే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ మద్దతు, ఆర్థిక లాభాలను బట్టి FIA ఆతిథ్య దేశాలను ఎంపిక చేస్తుంది. వీటితో పాటు భౌగోళిక వైవిధ్యం, పర్యావరణ బాధ్యత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. 2026లో 5 ఖండాలలోని 21 దేశాలలో మొత్తం 24 రేసులు నిర్వహించనున్నారు. క్రీడా విస్తరణ, చారిత్రక ప్రాముఖ్యత ఆధారంగానే ఈ అంతర్జాతీయ వేదికలను ఫిక్స్ చేయడం జరుగుతుంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH, DC మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, మ్యాచ్ సమయానికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా, ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉండటంతో ఈ పిచ్పై పేసర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.
IPL అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అయ్యర్ మొత్తం 93 IPL మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా.. 55 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. కేవలం 35 మ్యాచ్ల్లో మాత్రమే ఓడాడు. దీంతో 59.13 శాతం విన్నింగ్ రేట్ క్రియేట్ చేశాడు. IPL చరిత్రలో సుదీర్ఘకాలం కెప్టెన్లుగా ఉన్న రోహిత్, ధోనీల రికార్డులకు ఇది గట్టి పోటీనిస్తోంది.
IPL ముగిసిన వెంటనే తీరిక లేకుండా మ్యాచ్లు షెడ్యూల్ చేయడంతో BCCIపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. IPL ముగిసిన వెంటనే 2 టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటన, ఇంగ్లాండ్లో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. జూలై 23 నుంచి జింబాబ్వే, టీమిండియా మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
అంతర్జాతీయ సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే సిరీస్లో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీకి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. నబీ 41 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 156 వికెట్లు తీశాడు. కానీ, ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడుతున్న నబీ 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయడని చాలామంది అడుగుతుంటారు. కానీ అతని 151 మ్యాచ్ల కెరీర్లో కేవలం 8-9 సార్లు మాత్రమే తొలి ఓవర్ వేశాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతన్ని జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. అతనికంటే మెరుగైన బౌలర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు’ అని కొనియాడాడు.
RR ఆల్రౌండర్, శ్రీలంక T20 కెప్టెన్ దాసున్ షనకపై పాక్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. PSLలోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఏడాది పాటు నిషేధం విధించింది. దీనిపై షనక స్పందిస్తూ.. ‘PSL నుంచి తప్పుకోవడం నా తప్పే. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమించండి. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్లో పాల్గొనే ఛాన్స్ వస్తుందనుకుంటున్నా’ అని అన్నాడు.
జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, ఐపీఎల్లో సుదీర్ఘకాలం బిజీగా ఉన్న భారత టాప్ ప్లేయర్లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కీలక ఆటగాళ్లకు విరామం దొరకడమే కాకుండా, యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే ఛాన్స్ లభిస్తుంది.
ముంబైతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ పిచ్పై 160-170 పరుగులు చేయడమే చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోవడం వల్లే ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ సాధించిందని పేర్కొన్నాడు. ఈ ఓటమిని సమస్యగా చూడదలుచుకోలేదని తెలిపాడు. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు.
టెన్నిస్ కింగ్ జకోవిచ్, క్రికెట్ దిగ్గజం కోహ్లీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జకోవిచ్ మాట్లాడుతూ.. కోహ్లీ వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని చెప్పాడు. త్వరలోనే భారత్కు వచ్చి కోహ్లీని కలవాలని ఆశిస్తున్నానని జకోవిచ్ వెల్లడించాడు. కాగా, వీరిద్దరూ కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్న విషయం తెలిసిందే.
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే (101*) పరుగులు సాధించాడు. ఈ మెరుపు సెంచరీతో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ చేసి సృష్టించిన రికార్డును తిలక్ ఇప్పుడు సమం చేశాడు. ఈ జాబితాలో కామెరాన్ గ్రీన్ (47 బంతులు), సూర్యకుమార్(49 బంతులు)గా ఉంది.
IPL మ్యాచ్ టికెట్లపై విధిస్తున్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేశాయి. IPL మ్యాచ్లను వినోదాత్మకంగా కాకుండా కేవలం ఒక క్రీడగానే పరిగణించాలని తెలిపాయి. ప్రస్తుతం మ్యాచ్ టికెట్లపై 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. తొలుత మ్యాచ్ టికెట్లపై 28 శాతం పన్ను ఉండగా, గతేడాది సెప్టెంబరులో దీన్ని పెంచారు.
IPL 2026లో భాగంగా GTతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ (101*) సంచలన శతకంతో ముంబై 199 పరుగులు చేసింది. అయితే, గుజరాత్ కేవలం 100 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు మొత్తం కలిసి 100 పరుగులు చేస్తే.. తిలక్ వర్మ ఒక్కడే 101 రన్స్ చేశాడు. దీంతో IPLలో ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ప్లేయర్గా తిలక్ నిలిచాడు.