2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్లపై విపరీతమైన ఒత్తిడి ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. మెగా టోర్నీ కోసం నాణ్యమైన పిచ్లను సిద్ధం చేయడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వికెట్లు రూపొందించడంలో క్యూరేటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.
ఇవాళ న్యూజిలాండ్-పాక్ పోరుతో T20 WC సూపర్-8 రౌండ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్ దశలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా ఫర్హాన్(220*), నిస్సంక(199*), కుశల్ మెండిస్(182), మార్క్రమ్(178*), ఇషాన్(176*) టాప్ 5లో నిలిచారు. బౌలర్ల లిస్టులో స్కాల్క్విక్(13 వికెట్లు), వరుణ్(9*), ముజర్బానీ(9*), లియాస్క్(9), ఒమర్జాయ్(9) టాప్ 5 ప్లేయర్లుగా ఉన్నారు.
రేపు ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో బంగ్లా తలపడనుంది. సెమీస్లో SLను IND, PAKను BAN ఓడించి ఈ తుదిపోరుకు చేరాయి. అయితే 2023 టోర్నీలోనూ ఇలాగే సెమీస్, ఫైనల్ ఇవే జట్ల మధ్య జరిగింది. నాటి టైటిల్ పోరులో బంగ్లాపై భారత్ 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సారీ అలాగే ప్రత్యర్థిని రాణించాలని యువ భారత్ భావిస్తోంది.
ఆస్ట్రేలియా అమ్మాయిలతో భారత్ ఆడుతున్న 3 T20ల సిరీస్ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఇరుజట్లు అడిలైట్ వేదికగా సిరీస్ డిసైడర్ మ్యాచ్లో తలపడనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మల్టీ ఫార్మాట్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన హర్మన్ సేన.. ఈ T20 టైటిల్తో శుభారంభం పొందాలనే యోచనలో ఉంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 26న జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. అయితే, భారత బౌలర్లు ముగ్గురిపై దృష్టి పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ని త్వరగా ఔట్ చేస్తే జింబాబ్వేపై ఒత్తిడి పెంచడం ఖాయం. మరో ఓపెనర్ మరుమానితో పాటు కెప్టెన్ సికందర్ రాజ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురిని కట్టడి చేస్తే చాలని విశ్లేషకులు సూచించారు.
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెనెట్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచుల్లో కలిపి బెనెట్ 175 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, ఇతర జట్లలోని ఓపెనర్లు ఒక్కసారైనా పెవిలియన్కు చేరారు. కానీ, బెనెట్ ఒక్కసారి కూడా ఔట్ అవ్వలేదు.
T20 ప్రపంచకప్లో గ్రూప్ దశ ముగిసింది. రేపటి నుంచి అసలైన సమరం ‘సూపర్-8’ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-2లో భాగంగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు.. చెరో మ్యాచ్లో ఓటమిపాలైనప్పటికీ సూపర్-8లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి.
పసికూన ఒమన్పై ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపింది. తొలుత ఒమన్ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లలో మార్ష్ (64*) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, హెడ్ 32 పరుగులతో రాణించాడు. ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. విజయంతో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.
T20 WC ఫైనల్ పోరు భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఈ టోర్నీలోనే బలమైన జట్టుగా ఉందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా ఫైనల్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
పసికూన ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. దీంతో ఒమన్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, మాక్స్వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు.
టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా SMలో వెల్లడించాడు. గత 15 నెలలుగా కోర్టులో ఈ న్యాయపోరాటం సాగిందని, చివరకు ఈ అధ్యాయం ముగిసిందని పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సోదరుడైన రాహుల్, గత ఏడాది జరిగిన IPL 2026 వేలంలో CSK రూ. 5.2 కోట్లకు కొనుగోలు సంగతి తెలిసిందే.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు టీమిండియా బౌలింగ్ కోచ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్పై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అతని సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ నెట్స్లో కఠినంగా శ్రమిస్తున్నాడని, త్వరలోనే అతను భారీ స్కోర్లతో ఫామ్లోకి వస్తాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.
టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.