టీమిండియాలో చోటు కోసం యువ ఆటగాళ్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో, వారికి అవకాశం కల్పించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్లను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం రెండు టీ20 జట్లను సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.