స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.
టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.
2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా కోహ్లీకి ఉందని కొనియాడాడు. ఆసీస్ జట్టులో కోహ్లీ వంటి ఆటగాడు లేడని, అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఒత్తిడికి లోనై ఓడిపోయామని పేర్కొన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని వ్యాఖ్యానించాడు.
‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
నెదర్లాండ్స్తో మ్యాచ్లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్తో ఆకట్టుకున్నాడని చెప్పాడు. టీ20ల్లో షాట్లు ఆడటమే కాదు, బంతిని టైమ్ చేస్తూ గ్యాప్స్లోకి ఆడటం కూడా ముఖ్యమన్నాడు.
సూపర్-8లో భాగంగా ఈనెల 21న భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లలోనూ అద్భత ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే, బుమ్రా, వరుణ్ చక్రవర్తి టీమిండియాలో గేమ్ ఛేంజర్స్ అని వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్ జట్టు కాస్తా మెరుగ్గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్తో జరిగే తమ తొలి మ్యాచ్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
2008 ముంబై దాడుల తర్వాత 2009 నుంచి IPLలో పాక్ ప్లేయర్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్-‘ది హండ్రెడ్’లో కూడా పాక్ ప్లేయర్లను తీసుకునేందుకు 8 ఫ్రాంచైజీలలో 4 నిరాకరిస్తున్నాయట. ఈ MSG, MI లండన్, సథరన్ బ్రేవ్(క్యాపిటల్స్), సన్రైజర్స్ లీడ్స్లకు ఓనర్స్ IPL ఫ్రాంచైజీలే కావడం ఇందుకు కారణం. అందుకే SA20లోనూ నసీం షా, మహ్మద్ నవాజ్ మినహా ఎవరూ ఆడలేదు.
పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మడం వల్లే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిందని BCB జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ను నఖ్వీ రెచ్చగొట్టారని.. ఆయన మాటలు విని ఎవరు మాత్రం గెలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా భారత్ తమ ప్లేయర్లకు సేఫ్ కాదంటూ బంగ్లా టోర్నీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
నెదర్లాండ్స్పై శివమ్ దూబే తన అద్భుత ప్రదర్శన(66 రన్స్, 2 వికెట్లు)తో టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో IPLలో చూసినదాని కంటే దూబే ఆట చాలా అప్గ్రేడ్ అయిందంటూ క్రికెట్ దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ టిప్స్, మ్యాచులు లేనప్పుడు ఆట మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న హోంవర్క్ అతనికి చాలా కలిసి వచ్చాయని పేర్కొన్నారు.
అఫ్గన్ కోచ్గా జొనాథన్ ట్రాట్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు ప్లేయర్లు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు. జద్రాన్ తన POTM అవార్డును ట్రాట్కు అంకితం చేశాడు. ట్రాట్ నాలుగేళ్లుగా అఫ్గన్ను వెంటుండి నడిపారని, తొలి రోజు నుంచే తమను తీర్చిదిద్దారని నబీ ట్వీట్ చేశాడు. ట్రాట్ కోచింగ్లో అద్భుతంగా గడిపామని, ఆయన వెళ్లిపోవడం కష్టంగా ఉందని రషీద్ పేర్కొన్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి ‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో శ్రీలంక విసిరిన 119 రన్స్ లక్ష్యాన్ని మన అమ్మాయిలు 13.3 ఓవర్లలోనే ఛేదించారు. దినేష్ వృంద 42, అనుష్క శర్మ 27 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు, 28 పరుగులతో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి జట్టు తుదిపోరుకు చేరడంలో కీలక పాత్ర పోషించింది.
T20 WCలో అభిషేక్ ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ కావడం అటు జట్టును, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతనికి కీలక సూచన చేశారు. తొలి బంతికి బౌండరీ కోసం కాకుండా సింగిల్కు ప్రయత్నించాలని, ప్రారంభంలో పరుగులు చేయకున్నా క్రీజులో నిలబడాలని సూచించారు. ఒక్కసారి స్థిరపడితే రన్స్ సునాయాసంగా పరుగులు వస్తాయని పేర్కొన్నారు.