IPL 2026లో భాగంగా LSGతో జరిగిన మ్యాచులో పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అలా ఆడాలంటే చాలా ధైర్యం కావాలని తెలిపాడు. కనోలీ, ప్రియాంశ్తోపాటు ఇతర బ్యాటర్లకూ ఓ మాట ఇచ్చినట్లు చెప్పాడు. ఈ IPLలో ఎవరైతే ఎక్కువ సిక్స్లు కొడతారో వారికి తన బ్యాట్ను బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.