NDL: ఉయ్యాలవాడ గ్రామంలో ఏప్రిల్ 28, 29 తేదీలలో జరగనున్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆళ్లగడ్డ నుంచి జమ్మలమడుగుకు వెళ్లే వాహనాలు దొర్నిపాడు, కోవెలకుంట్ల మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. జాతర సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఇవాళ విజ్ఞప్తి చేశారు.