IPL 2026లో ఏడు మ్యాచ్లు ఆడి ఒక్కటే గెలిచిన కోల్కతాకు కాస్త ఊరట లభించింది. పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్న శ్రీలంక పేసర్ మతీష పతిరన ఎట్టకేలకు జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. అయితే, కొన్ని సెషన్ల పాటు పతిరన మ్యాచ్ ఫిట్నెస్ను అంచనా వేసిన తర్వాతే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయనున్నారు.