MNCL: జన్నారం మండలంలో అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు లిప్ పగటివేళ 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.