NRPT: నర్వ మండలంలో సోమవారం వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెన్నయ్య సాగర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నర్వలో ప్రారంభించి పాతర్చేడ్, ఉందెకోడ్, కన్మనూర్ గ్రామాల్లో కొనసాగుతాయని చెప్పారు. రైతులు, అధికారులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.