శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 168 పరుగులు చేసింది. ఒక దశలో 12.1 ఓవర్లలో 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సాంట్నర్ (47), మెక్కాంచీ (31) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్కు 47 బంతుల్లో 84 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చమీర, తీక్షణ తలో 3 వికెట్లు పడగొట్టారు.
జింబాబ్వేతో రేపు జరగనున్న మ్యాచ్లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ను ఓపెనర్గా ఆడించాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఇషాన్ కిషన్ను వన్ డౌన్లో పంపించాలన్నాడు. దీంతో లెఫ్ట్&రైట్ ఓపెనింగ్ జోడీతో బౌలర్లపై ఆధిపత్యం సాధించవచ్చన్నాడు. ఒకవేళ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కకపోతే.. వన్ డౌన్లో సూర్య రావాలని సూచించాడు.
రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. ‘వారు రెండు బౌండరీలు బాదితే అంతా సర్దుకుంటుంది’ అని తెలిపాడు. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు.
T20 WCలో భాగంగా కొలంబో వేదిగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గ్రూప్-2లో ఇప్పటికే లంక తమ తొలి మ్యాచ్ ఓడగా.. పాక్, కివీస్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో ఇవాళ విజయం సాధించడం ఇరుజట్లకు తప్పనిసరిగా మారింది. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
కొలంబో వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 2 మ్యాచ్ల్లో 2 పాయింట్లతో NZ.. 2 మ్యాచ్ల్లో ఒక పాయింట్తో SL, PAK ఉంటాయి. దీంతో సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ గెలవడం వీటికి కీలకం కానుంది.
T20 WCలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో పాక్ జట్టుపై SMలో ఆ దేశ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘాతో పాటు అతడి భార్య, కుమారుడిని టార్గెట్ చేస్తూ అసభ్య కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అఘా భార్య స్పందిస్తూ.. “నన్ను, నా కొడుకును దుర్భాషలాడటం వల్ల మీరు WC గెలవలేరు’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 284/2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన J&K.. ఆట ముగిసే సమయానికి 527/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభమ్ (121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (57*) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్పై ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బట్లర్ ఇంగ్లండ్ క్రికెట్కు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నాడు. కెప్టెన్గా T20 WCను కూడా అందించాడు. అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. అతడో పవర్ హౌస్. నాకౌట్ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తారు’ అంటూ బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.
టీమిండియాలోకి పునరాగమనం చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, పాక్ ప్లేయర్ ఫర్హాన్ నుంచి అభిషేక్ టాప్ ప్లేస్కు ముప్పు ఏర్పడింది. అతడు T20 WCలో తన ప్రదర్శనతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త హెడ్కోచ్గా ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ పైబస్ నియమితులయ్యాడు. కోచ్ జొనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ ముగియడంతో, అతడి స్థానంలో రిచర్డ్ను నియమించినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. రిచర్డ్కు కోచ్గా మంచి రికార్డు ఉంది. అతడు 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు(కోచ్/డైరెక్టర్) సేవలందించాడు.
T20 WC చరిత్రలో ఆసియా జట్లు లేకుండా ఇప్పటివరకు సెమీఫైనల్స్ జరగలేదు. దాదాపు ప్రతి ఎడిషన్లోనూ రెండు ఆసియా జట్లు సెమీస్కు (2016, 2021ల్లో ఒక్కో జట్టు మాత్రమే) చేరుకున్నాయి. అయితే, ఈసారి సెమీస్ చేరుకోవడానికి భారత్, పాక్, శ్రీలంక తడబడుతున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం SA, WI, NZలతో ఆసియా జట్లకు భారీ పోటీ నెలకొంది.
తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిన్న రింకూ సింగ్ నోయిడాకు వెళ్లాడు. దీంతో అతడు రేపటి జింబాబ్వే మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే, రేపటి మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో రింకూ కీలకమని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలో అతడు చెన్నై చేరుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో అతడు చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.
టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని తెలిపాడు. అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ మ్యాచ్లో ఆడించాలని పేర్కొన్నాడు. దీంతో బ్యాటింగ్లో బలం పెరుగుతుందన్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, పాండ్యా సరిపోతారని వ్యాఖ్యానించాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్ 2026-27 ఆసీస్ హోమ్ సీజన్కు ఆరంభం కానుంది. గతంలో 2017లో మీర్పూర్లో ఆసీస్ను ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తలపడనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.