సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్న జింబాబ్వే, ఇప్పుడు పటిష్టమైన వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో రెండు జట్లు కూడా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. దీంతో, ఈ ‘అజేయ’ జట్ల మధ్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్తో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ విజయంతో T20 WCలో కెప్టెన్గా 13వ విజయాన్ని నమోదు చేశాడు. తద్వారా T20 WC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్(12)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ధోనీ(21), విలియమ్సన్(14) తొలిరెండు స్థానంలో కొనసాగుతున్నారు.
T20 WC సూపర్-8లో భాగంగా ఈనెల 26న జింబాబ్వేతో భారత్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే, ప్రపంచకప్లో భారత్ పోరాటం ముగిసినట్లే.
అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో ఇదే స్టేడియంలో మూడు మ్యాచ్లు ఆడింది. దీనివల్ల పిచ్ పరిస్థితులపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఏర్పడింది. వెస్టిండీస్తో మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. దీంతో, ‘సౌతాఫ్రికా ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్లు ఆడేలా ICC షెడ్యూల్ను ఎలా రూపొందించింది?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన 2023 WC ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమిని భారత్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తాజాగా S-8లో సౌతాఫ్రికా చేతిలో కూడా ఇదే స్టేడియంలో భారత్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతోంది. దీంతో, ‘భారత్కు అచ్చిరాని ఈ స్టేడియంలోనే కీలక మ్యాచ్లు ఎందుకు నిర్వహించాలి?’ అంటూ అభిమానులు SMలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్గా T20 WC బరిలోకి దిగిన భారత్కు దక్షిణాఫ్రికా భారీ షాక్ ఇచ్చింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టినప్పటికీ బౌలర్లు 180+ స్కోర్ను ఇచ్చారు. ఇక బ్యాటింగ్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ ఒక్క ఓటమితో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో సన్నగిల్లాయి.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి పాలవ్వడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్ రేట్తో గ్రూప్-1లో చివరి స్థానంలో ఉంది. దీనివల్ల భారత్ తన చివరి రెండు మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ సెమీస్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు’ అని పేర్కొన్నాడు. అలాగే, రింకూను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పొందింది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన బంతులు సంధించారని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉందన్నాడు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రేవిస్.. బ్యాట్ మీదకు బంతి రాకున్నా వారు పరిస్థితులకు తగ్గట్లు చక్కగా ఆడారని కొనియాడాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో దక్షిణఫ్రికాపై అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, దాన్ని మరిచిపోయారా అని నిలదీశాడు. నిన్న అతడిని ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
జట్టు కూర్పు కోసమే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్ను తీసుకోవాల్సి వచ్చిందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ తెలిపాడు. అయితే వాషింగ్టన్ సుందర్.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 11 రన్స్ నిరాశపరిచాడు. కాగా మొత్తంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్ను ఓడించిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్కప్-2026 సూపర్-8లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచులో వెనుకబడ్డామని, ఆ తర్వాత ఫామ్లోకి రాలేకపోయామని చెప్పాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ మెరుగ్గా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.
సూపర్ 8 ఆరంభంలోనే భారత్ చతికిలపడింది. దీంతో 2024 వన్డే WC ఫైనల్ తర్వాత ICC టోర్నీల్లో తొలి ఓటమి చవిచూడక తప్పలేదు. ఇందుకు పవర్ ప్లేలో టాపార్డర్ వెనుదిరగడం, చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలు లేకపోవడం, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమే ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. గత టోర్నీ తర్వాత 8 సిరీస్ విజయాలతో పొందిన ఆనందం కంటే ఈ ఓటమి ఎక్కువగా నొప్పిస్తోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచులో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఇదే తొలి ఓటమి.