• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

భారత్‌తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్ (101) సెంచరీతో అదరగొట్టగా, లిచ్‌ఫీల్డ్ (80) పరుగులతో రాణించింది. వరుసగా 2 విజయాలతో ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

February 27, 2026 / 03:53 PM IST

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. జింబాబ్వేతో నిన్న జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.. అర్ష్‌దీప్ 81 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

February 27, 2026 / 02:49 PM IST

T20 WC: సెమీస్‌కు అడుగు దూరంలో భారత్

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. జింబాబ్వేపై విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ కూడా రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

February 27, 2026 / 02:19 PM IST

టీమిండియా సెలక్టర్లకు నబీ వార్నింగ్..?

రంజీ సీజన్‌లో జమ్మూకాశ్మీర్‌ బౌలర్ ఆకిబ్ నబీ దూసుకుపోతున్నాడు. ఈ రంజీ సీజన్‌లో నబీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్‌ మెసేజ్ పంపిచినట్లైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన తనను టీమిండియాకు ఎలా ఎంపిక​ చేయరో చూస్తా అన్నట్లుగా ఆడాడు.

February 27, 2026 / 01:34 PM IST

INDW vs AUSW: ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(52), హర్మన్ ప్రీత్‌(54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లు ఆష్లీ గార్డనర్, అలానా కింగ్, అన్నాబెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీస్ టార్గెట్: 252.

February 27, 2026 / 12:51 PM IST

నేను ఇంకో ఓవర్ బౌలింగ్ చేయాలి: హార్దిక్

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. కానీ, నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను’ అని అన్నాడు.

February 27, 2026 / 12:49 PM IST

ఆ కోరిక తీరకుండానే రింకూ తండ్రి మృతి

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు స్టార్ క్రికెటర్ అయినా.. రూ. కోట్లు సంపాదిస్తున్నా.. ఆయన మాత్రం గ్యాస్ సిలిండర్ మోస్తూ కష్టపడేవారు. పనులన్నీ వదిలి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇలా జరగడం బాధాకరం. కొన్ని రోజుల్లో రింకూకి పెళ్లి జరగనుండగా.. ఆ వివాహ వేడుక చూడకుండానే ఆయన కన్నుమూయడం అందరిని కలిచివేస్తోంది.

February 27, 2026 / 12:42 PM IST

జింబాబ్వేపై సూర్య కీలక వ్యాఖ్యలు

జింబాబ్వే బ్యాటర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ వారి పర్ఫామెన్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పవర్ ప్లేలో కాస్త స్లోగా ఆడినా.. చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఇక వెస్టిండీస్ మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. ఒక రోజు రెస్ట్ తీసుకుని మ్యాచ్‌కు రెడీ అవుతాం’ అని పేర్కొన్నాడు.

February 27, 2026 / 12:27 PM IST

మ్యాచ్ గెలిచాం.. కానీ బౌలింగ్ బాలేదు: సూర్య

T20 WCలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మా లోపాలను సరిదిద్దుకుంటాం’ అని తెలిపాడు.

February 27, 2026 / 12:12 PM IST

రంజీ ట్రోఫీ ఫైనల్.. కర్ణాటక ఆలౌట్

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఇబ్బందుల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (86*) రాణించినప్పటికీ, జమ్మూ బౌలర్ల ధాటికి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 293 పరుగులకే కర్ణాటక ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటక జట్టు 291 పరుగుల వెనకంజలో ఉంది. కాగా, జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 11:48 AM IST

సంజూపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో బౌండరీలు కొట్టే క్రమంలో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ రిస్క్ తీసుకోకపోతే జట్టు స్కోరు వేగంగా పెరగదు. అందుకే ‘సంజూని నిందించలేం’ అని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ గ్యాప్స్‌ను వాడుకోవడమే అతని ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు.

February 27, 2026 / 11:32 AM IST

టీమిండియాపై సచిన్‌ ప్రశంసలు

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోనూ ఇదే రిథమ్ కొనసాగించాలని సూచించాడు. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా, అందరూ కలిసికట్టుగా రాణించారని అభినందించాడు.

February 27, 2026 / 11:12 AM IST

మా నాన్న వారిని శపించాడు: అర్ష్‌దీప్

చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నాడు. ‘సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌ను నా తండ్రితో కలిసి టీవీలో చూశాను. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ మా తండ్రి వారిపై అరిచాడు. వారిని శపించాడు’ అని తెలిపాడు.

February 27, 2026 / 10:54 AM IST

టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ నయా రికార్డ్

భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్‌లలోనే అర్ష‌దీప్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అర్షదీప్ క్రియేట్ చేయగా… అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు.

February 27, 2026 / 10:32 AM IST

టీమిండియాకు GOOD NEWS

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.

February 27, 2026 / 10:12 AM IST