సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉన్నందున తొలి బంతి నుంచి భారీ షాట్లకు ప్రయత్నిస్తారని.. వారిని కట్టడి చేసేందుకు చూడలని సూచించారు.
సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉన్నందున తొలి బంతి నుంచి భారీ షాట్లకు ప్రయత్నిస్తారని.. వారిని కట్టడి చేసేందుకు చూడలని సూచించారు.
IPL 2026 షెడ్యూల్ ప్రకారం మార్చి 26న కాకుండా 28న ప్రారంభమవుతుంది. అయితే టైటిల్ పోరు మే 31నే జరుగుతుంది. ఈ విషయంతో పాటు పూర్తిస్థాయి షెడ్యూల్, వేదికల వివరాలపై వచ్చే వారంలో BCCI అధికారిక ప్రకటన చేయనుందని క్రికెడ్ వర్గాలు తెలిపాయి. కాగా అసోం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై స్పష్టత రాలేదు. ఎన్నికల, IPL షెడ్యూల్స్ క్లాష్ కాకూడదని ఈ నిర్ణయం తీసుుకున్నట్లు తెలుస్తోంది.
రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ స్వగ్రామానికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే శనివారమే అతను జట్టుతో కలుస్తాడని BCCI వర్గాలు తెలిపాయి. ఖాన్చంద్ తీవ్ర అనారోగ్యంతో మొన్న నోయిడాలో చికిత్స పొందుతుండగా..రింకూ జింబాబ్వే మ్యాచ్ ముందు కూడా జట్టును వీడాడు. మ్యాచ్ వేళకు వచ్చినా తుదిజట్టులో ఛాన్స్ రాలేదు.
ఇంగ్లండ్తో ఉత్కంఠభరితంగా సాగిన కీలక ‘సూపర్ 8’ మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో తడబడ్డారు. దీంతో ఇప్పటికే సెమీస్కు చేరిన ఇంగ్లండ్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఈ ఓటమితో కివీస్ ‘సెమీస్’ ఆశలు రేపటి SL vs PAK పోరుపై ఆధారపడి ఉన్నాయి. అందులో పాక్ ఓడితేనే కివీస్ సెమీస్కు చేరుతుంది.
పల్లేకలె వేదికగా రేపు రాత్రి 7 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా, పాక్ సెమీస్ ఆశలు ఈరోజు జరుగుతున్న ENG vs NZ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ ఇంటిదారి పడుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోతే మాత్రం.. లంకతో జరిగే మ్యాచ్లో పాక్ భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్కు చేరుకుంటుంది.
ఇంగ్లండ్తో మ్యాచ్లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 159/7 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు సీఫెర్ట్ (35), అలెన్ (29) తొలి వికెట్కు 64 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఫిలిప్స్ (39) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. బౌలర్లలో జాక్స్, అహ్మద్, రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత రెండు మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సౌతాఫ్రికా, జింబాబ్వేలపై చక్రవర్తి భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్ అతడికి మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో చక్రవర్తి ఖచ్చితంగా రాణిస్తాడని పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ను మెయిడెన్ చేశాడు. అలాగే, ఈ WCలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్ పాండ్యా, శ్రీలంకతో మ్యాచ్లో హెన్రీ(NZ) కూడా తమ తొలి ఓవర్ను మెయిడెన్గా వేశారు. అయితే, ఈ మూడు మెయిడెన్ ఓవర్లు కూడా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ల్లోనే రావడం గమనార్హం.
రంజీ ఫైనల్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ 477 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌటైంది. JK తొలి ఇన్నింగ్స్లో 584, ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 186/4 పరుగులు చేసింది. రేపు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా జమ్మూకశ్మీర్ విజేతగా నిలవడం ఖాయం.
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. నబీ భారత జెర్సీ ధరించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు గంగూలీ సూచించాడు. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలో నబీని టీమిండియా జెర్సీలో చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
జింబాబ్వేతో మ్యాచ్లో శివమ్ దూబే కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. దూబే బౌలర్గా ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అతడితో బౌలింగ్ చేయించే ముందు జట్టు విజయావకాశాల గురించి ఆలోచించాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు.
జింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ ఈ మ్యాచ్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం తనను తీవ్రంగా ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అభిషేక్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో అందరికీ తెలిసిందేనని.. కానీ ఈ మ్యాచ్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆడాడని పేర్కొన్నాడు. ఇకపై ఇదే శైలిలో ఆడాలని అతడికి సూచించాడు.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 17 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. 3 మ్యాచ్లు టై అయ్యాయి. అలాగే, 7 ప్రపంచకప్ మ్యాచ్లలో ఇంగ్లండ్ 4, న్యూజిలాండ్ 3 మ్యాచ్లలో గెలిచాయి. మొత్తంగా న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.