టీ20 ప్రపంచకప్ సూపర్-8లో కీలక మ్యాచ్లో వెస్టిండీస్ను టీమిండియా ఢీకొట్టనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో టాస్ అత్యంత కీలకం కానుంది. మరి టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ లేదా బౌలింగ్లో ఏది ఎంచుకుంటే మంచిదో కామెంట్ చేయండి.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 153/7 పరుగులు చేసింది. సికందర్ రజా 73, క్లైవ్ మదండే 26* రన్స్ చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మఫాక, బోష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరగా.. జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 185 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో సిరీస్ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. స్నేహ్ రాణా 44, ప్రతీక 27, జెమీమా 42, హర్మన్ప్రీత్ 25 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలనా కింగ్ 4 వికెట్లు, జార్జియా 2 వికెట్లు పడగొట్టారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8 భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లకు కూడా కొంత సహకారం లభిస్తుందని ప్రధాన క్యురేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని చెప్పాడు. మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ను టీమిండియా ఢీకొట్టనుంది. అయితే, దక్షిణాఫ్రికాతో ఓడిపోయినప్పటికీ విండీస్ జట్టు మంచి ఫామ్లోనే ఉంది. హిట్టర్లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. ఓపెనర్ల నుంచి ఆఖరి స్థానంలో వచ్చే ప్లేయర్ వరకు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆఖరి వికెట్ తీసేంతవరకు భారత బౌలర్లు పంజుకోవాల్సి ఉంది.
ఆస్ట్రేలియా వుమెన్స్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 105 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రతికా రావల్ (27), స్మృతి మందాన (0), జెమీమా (42) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ప్రీత్ (15*), హర్లిన్ (10*) ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 105 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 409/7 పరుగులు చేసింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి దుబాయ్ ఎయిర్పోర్ట్పై పడింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై పీవీ సింధు పోస్టు చేసింది. తాము బస చేస్తున్న ప్రాంతానికి సమీపంలో పేలుడు జరిగిందని, దీంతో వెంటనే అక్కడినుంచి పారిపోయామని తెలిపింది. భయానక పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.
T20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్ సెమీ ఫైనల్కు చేరుతుంది. అయితే INDను ఓ సమస్య వేధిస్తుంది. బుమ్రా, అర్షదీప్ మినహా సూపర్ 8 మ్యాచ్లలో హార్దిక్, వరుణ్, అక్షర్, దూబే ఎక్కువగా రన్స్ ఇస్తున్నారు. WI టీంలో 9వ స్థానంలో వచ్చిన షెపర్ట్ అర్థశతకం చేశాడంటే ఆ టీమ్ ఎంత బలంగా ఉందో చెప్పొచ్చు.
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి సిద్దమయ్యాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ వాటిని ఖండించాడు. లైక్స్, వ్యూస్ కోసం అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని నెటిజన్లను కోరాడు.
కోల్కతాలో ఇవాళ విండీస్తో భారత్ కీలక పోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. T20 WC సెమీస్ చేరేందుకు ఇరుజట్లకూ కీలకమైన ఈ మ్యాచులో భారత్కే విజయావకాశాలు ఎక్కువ. ఈడెన్ గార్డెన్స్లో భారత్ ఇప్పటివరకు T20ల్లో ఒక్కటీ ఓడలేదు. పైగా అక్కడ 1983 నుంచి జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచులోనూ INDను విండీస్ ఓడించలేదు. ఇంకా T20ల్లో 19-10తో విండీస్పై భారత్దే పైచేయి.
శ్రీలంకతో సూపర్ 8 మ్యాచులో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెమీస్కు అర్హత సాధించేందుకు ప్రత్యర్థిని 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లగా.. ఇందులో పాక్ సాధించిన విజయం వృథా అయింది. ఇక 213 రన్స్ లక్ష్యఛేదనలో లంక తరఫున రథ్నాయకే 58, కెప్టెన్ శనక 76* పరుగుల పోరాటం ఫలించలేదు.
T20 WC నుంచి పాక్ ఎలిమినేట్ అయింది. శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో ప్రత్యర్థిని 147 రన్స్ లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. పాక్ అలా చేయలేకపోయింది. దీంతో మెరుగైన రన్రేట్ ద్వారా గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ సెమీస్కు అర్హత సాధించింది. ప్రస్తుత మ్యాచ్లో పాక్ గెలిచినా వృథానే కాగా.. 16 ఓవర్లలో ఆట ముగిసేసరికి లంక స్కోర్ 150/5.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా రేపు ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత అమ్మాయిల జట్టు మూడో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ ఆసీస్ సొంతం కాగా.. వైట్ వాష్ నుంచి తప్పించుకునేందుకు మూడో వన్డేలోనైనా విజయం సాధించాలని హర్మన్ సేన భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరుజట్లు మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్లో ఢీకొంటాయి.
2026 T20 WCలో పాకిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధించకపోతే.. రెండు సెమీఫైనల్ మ్యాచ్లు భారత్లోనే జరుగుతాయి. తొలి సెమీస్ మార్చి 4న ఈడెన్ గార్డెన్స్, రెండో సెమీస్ మార్చి 5న వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. మార్చి 8న జరిగే ఫైనల్కు మోదీ స్టేడియం వేదిక కానుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ చేరితే.. తొలి సెమీస్, ఫైనల్ మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి.