LSG కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మాకు విరామం అవసరం. ప్రతి మ్యాచులో ఒత్తిడి ఉంటుంది. మనలోని పరిష్కారాలు కనుగొనాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది ఒకరిద్దరి ఆట కాదు’ అని వ్యాఖ్యానించాడు. సూపర్ ఓవర్లో పూరన్ను పంపిన నిర్ణయాన్ని కూడా పంత్ సమర్థించాడు. ‘అతను ఫామ్లో లేకపోయినా, కష్ట సమయాల్లో మన ఆటగాళ్లను నమ్మాలి’ అని తెలిపాడు.