LSG 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషభ్ పంత్ను ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే LSG ఓటములకు కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పంత్ను తప్పించి మార్క్రమ్కు కెప్టెన్సీ అప్పగించాలని వారు సూచిస్తున్నారు.