అఫ్ఘానిస్తాన్ స్టార్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒమర్జాయ్ తల్లి ఇవాళ కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో సహచర క్రికెటర్లు అతడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ఒమర్జాయ్ పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. తల్లి మరణంతో అతడు IPLను వీడి స్వదేశానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.