మూడు వారాలుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచుతున్న T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. రాత్రి IND vs WI మ్యాచ్తో సూపర్ 8 రౌండ్ ముగియగా.. 2 రోజుల్లో నాకౌట్స్ దశ ప్రారంభం కానుంది. 4న సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్(కోల్కతా), 5న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్(ముంబై) జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్లు 8న అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో ఢీకొంటాయి.
విండీస్పై విజయంతో భారత్ T20 WC సెమీస్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్మోహన్, కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, CR పాటిల్ సహా పలువురు కేంద్రమంత్రులు సూర్యసేనకు అభినందనలు తెలియజేశారు. ఓపికగా, ఒక్కటిగా అద్భుత ప్రదర్శన చేశారని, ముఖ్యంగా శాంసన్(97*) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడారు. కాగా వాంఖడే వేదికగా భారత్ 5న ఇంగ్లండ్తో సెమీస్ ఆడనుంది.
వెస్టిండీస్పై చారిత్రాత్మక విజయం అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ‘గతంలో నాకు ఎక్కువగా మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. కానీ, పదేళ్లుగా డగౌట్లో కూర్చొని కోహ్లీ, రోహిత్ల ఆట తీరును చూసి నేర్చుకున్నా. వారు నాకు సహాయం చేశారు. నా జీవితంలో గొప్ప రోజులలో ఇది ఒకటి’ అని శాంసన్ పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. ‘మంచి మనసున్న వారికి మంచే జరుగుతుంది.. ఇది అతడి కష్టానికి దక్కిన ప్రతిఫలం’ అని సంజూను ఆకాశానికెత్తాడు. వెస్టిండీస్పై ఛేదనలో కీలక పాత్ర పోషించిన శాంసన్ నిలకడను, పట్టుదలను అభినందించాడు. డగౌట్లో ఉంచి నేర్చుకున్న పాఠాలను మైదానంలో అమలు చేసి సంజూ నిరూపించుకున్నాడని ప్రశంసలు కురిపించాడు.
T20 WCలో భాగంగా టీమిండియా సెమీస్కు చేరింది. వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓపెన్ సంజు శాంసన్ 57 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. తిలక్ (27), సూర్యకుమార్ (18), హార్దిక్(17), అభిషేక్ (10), ఇషాన్ (10) పరుగులు చేశారు. ఈనెల 5న ఇంగ్లాండ్తో భారత్ సెమీ ఫైనల్లో తలపడనుంది. టీమిండియా వరుసగా మూడోసారి సెమీస్కు చేరింది.
T20 WCలో భాగంగా టీమిండియా సెమీస్కు చేరింది. వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓపెన్ సంజు శాంసన్ 57 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. తిలక్ (27), సూర్యకుమార్ (18), హార్దిక్(17), అభిషేక్ (10), ఇషాన్ (10) పరుగులు చేశారు. ఈనెల 5న ఇంగ్లాండ్తో భారత్ సెమీ ఫైనల్లో తలపడనుంది. టీమిండియా వరుసగా ఆరోసారి సెమీస్కు చేరింది.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సంజు శాంసన్ (97*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. 9.4 ఓవర్లకు స్కోర్ 97/2గా ఉంది. ఇషాన్ కిషన్ 10, అభిషేక్ శర్మ 10 పరుగులు చేశారు. భారత్ విజయ లక్ష్యం 196 రన్స్.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (10) మరోసారి నిరాశపరిచాడు. దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (10) ఔటయ్యాడు. దీంతో 41 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్లో సూర్యకుమార్(3*), సంజూ(24*) ఉన్నారు. పవర్ప్లే ముగిసేసరికి భారత్ స్కోర్ 53/2గా ఉంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పావెల్ (34*), హోల్డర్ (37*), రోస్టన్ చేజ్ (40), హెట్మయర్ (27), హోప్ (32) రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు.. వరుణ్, హార్దిక్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 196.
పదేళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచకప్ 2016 సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో విండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్-8లో వెస్టిండీస్తో టీమిండియా తలపడుతోంది. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారే పోటీలో నిలుస్తారు. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
టీమిండియాతో జరుగుతున్న కీలక పోరులో వెస్టిండీస్కు మళ్లీ షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్లో కీపర్ సంజూకు క్యాచ్ ఇచ్చి హెట్మయర్ (27) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (40) సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. గాల్లోకి ఎగిరి మరీ సూర్య క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. కెప్టెన్ హోప్ (32)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8.5 ఓవర్లలో 68 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్లో హెట్మయర్ (9*) రోస్టన్ ఛేజ్ (38*) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోర్ 82/1గా ఉంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో టీమిండియా తలపడుతోంది. ఇందులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. ఈ క్రమంలో భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కతే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నాడు. అనవసరమైన ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని తెలిపాడు.
వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త ఫీల్డింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో చేతిలో పడిన క్యాచ్ను మిస్ చేశాడు. రోస్టన్ ఛేజ్ (15*) ఇచ్చిన సులువైన క్యాచ్ నేలపాలు చేశాడు. దీంతో వికెట్ లేకుండానే పవర్ప్లే ముగిసింది. ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లకు 45/0గా ఉంది. క్రీజ్లో ఛేజ్ (20*), షై హోప్ (25*) ఉన్నారు.