వెస్టిండీస్తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్లో గెలిచి టీమిండియా సెమీఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శనపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. సంజూ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడని పేర్కొన్నాడు. అయితే, చివర్లో దూబే కొట్టిన రెండు ఫోర్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు. ఆ రెండు ఫోర్లే చివరి ఓవర్లో సంజూపై ఒత్తిడిని తగ్గించాయని స్పష్టం చేశాడు.
T20 WCలో భాగంగా 5న భారత్-ఇంగ్లండ్ సెమీస్లో తలపడనున్న సంగతి తెలిసిందే. సెమీస్ పోరులో ఇరుజట్లు ఢీకొనడం ఇది వరుసగా మూడోసారి. 2022లో తొలిసారిగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్ను చిత్తుచేయగా.. గత టోర్నీలో ప్రత్యర్థిని టీమిండియా 68 పరుగుల తేడాతో ఓడించింది. నాటి 2 టోర్నీల్లోనూ జట్లను రోహిత్-బట్లర్ నడిపించగా.. ఈ సారి సూర్య-బ్రూక్ బరిలోకి దిగారు.
T20 WC వేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ తనకు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఆడిన జట్ల కంటే సెమీస్లో తలపడే ఇంగ్లండ్ వేరే సవాల్ అని, వాళ్ల దగ్గర జాక్స్ వంటి ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే అభిషేక్ని సెమీస్ జట్టు నుంచి తప్పించకూడదని, అతను ఆటపై ఫోకస్ పెడితే చాలని కుంబ్లే సూచించాడు.
T20 WC సెమీస్లో తలపడే జట్లు ఖరారైన సంగతి తెలిసిందే. ఈనెల 4న సౌతాఫ్రికా-న్యూజిలాండ్.. 5న భారత్-ఇంగ్లండ్ ఢీకొననున్నాయి. అయితే ఈ సారి సెమీస్కు చేరిన ఈ 4 జట్లలో భారత్(ఆసియా), సౌతాఫ్రికా(ఆఫ్రికా), న్యూజిలాండ్(ఓషియానియా), ఇంగ్లండ్(యూరోప్) 4 వేర్వేరు ఖండాలకు చెందినవి కావడం విశేషం. 2016 తర్వాత ఇలా జరగడం ఇది రెండో సారి కాగా 4 జట్ల సారథులు కూడా కొత్తవారే కావడం గమనార్హం.
అఫ్గన్ టీమ్ జూన్లో భారత్ పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో ఆఫ్గన్ ఓ టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. టెస్ట్(న్యూ చండీగఢ్) జూన్ 6న ప్రారంభం కానుండగా.. 14న తొలి వన్డే(ధర్మశాల), 17న రెండో మ్యాచ్(లక్నో), 20న మూడో వన్డే(చెన్నై) జరగనున్నాయి. అఫ్గన్ పర్యటన సందర్భంగా రోహిత్-కోహ్లీ జోడీ మరోసారి ‘మెన్ ఇన్ బ్లూ’ జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.
IND vs WI మ్యాచ్ డ్రింక్ బ్రేక్ వేళ కోల్కతా మైదానంలో లేజర్ షో నిర్వహించడంపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మండిపడ్డారు. లేజర్ లైట్ వల్ల బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుందని, T20 WC వంటి కీలక వేదికపై మ్యాచ్ మధ్యలో ఇలాంటి వినోదం అవసరమా అని ప్రశ్నించారు. IPL టోర్నీ మధ్యలో అయితే ఓకే కానీ నాకౌట్స్లో ఇది సరికాదని సూచించారు.
WIపై విజయంతో భారత్ T20 WC సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ను క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమిర్ భారత్ సెమీస్కు అర్హత సాధించలేదని, బ్యాటింగ్ లైనప్ కూలిపోతుందని విమర్శలు చేశాడు. ఈ క్రమంలో అతను కొనియాడిన విండీస్పైనే భారత్ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లడం విశేషం.
విండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయిర్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. T20 WC ఒకే ఎడిషన్లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే టోర్నీలో 18 సిక్సర్లు కొట్టిన పాక్ ప్లేయర్ షాహిబ్దాదా ఫర్హాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు అగ్రస్థానంలో ఉన్న నికోలస్ పూరన్(2024లో 17) ఇప్పుడు మూడో స్థానంలో, గేల్(2012లో 16) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.
T20 WC నుంచి పాక్ వైదొలిగిన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ ఆఘాపై ఆ దేశ జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. లంక-ఆసీస్ సిరీసుల్లో మూడో స్థానంలో బాగా ఆడిన తను ఎందుకు టోర్నీలో అక్కడే ఆడలేదని, బాబర్ సేవలను ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోతున్నారని నిలదీశారు. జట్టులో ప్రతి నిర్ణయం కోచ్ మైక్ హెసన్ తీసుకుంటూ ఆఘాను డమ్మీ కెప్టెన్ చేశాడనీ మండిపడ్డారు.
శ్రీలంక హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని జయసూర్య నిర్ణయించుకున్నాడు. T20 WC సెమీస్కు లంక చేరకపోవడంతో.. తన బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. టైటిల్తో తన పదవి నుంచి వైదొలగాలనుకున్నా కానీ అలా సాధ్యపడకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. కాగా జయసూర్య కాంట్రాక్ట్ జూన్ వరకు ఉండగా.. తన నిర్ణయాన్ని త్వరలోనే లంక బోర్డుకు తెలియజేస్తానన్నాడు.
విండీస్పై అద్భుత విజయంతో T20 WC సెమీస్కు అర్హత సాధించిన భారత్ను మాజీ క్రికెటర్లు అభినందించారు. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు సెమీస్ బెర్త్ ఖరారు చేసిందని, సంజూ కీలక ఇన్నింగ్స్ ఆడాడని అనీల్ కుంబ్లే పేర్కొన్నాడు. భారత్ ఒత్తిడిని హ్యాండిల్ చేస్తూ విజయం, సెమీస్కు అర్హత సాధించిందని.. మిషన్ ఇలాగే కొనసాగాలని VVS లక్ష్మణ్ ఆకాంక్షించాడు.
విండీస్పై కీలక పోరులో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. దీంతో భారత్ సైమీస్కు అర్హత సాధించిందని, క్రీజులో సంజూ శాంసన్ పాతుకుపోయి ఆడుతుంటే చూడటానికి బాగుందని పేర్కొన్నాడు. అలాంటి ఇన్నింగ్స్లే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయని చెప్పుకొచ్చాడు.
విండీస్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తన ఇన్నింగ్స్పై శాంసన్(97*) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది తనకెంతో ప్రత్యేకమని, క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి రోజు నుంచీ దీని కోసమే ఎదురుచూశానని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహించలేదన్నాడు. కాగా ఛేజింగ్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సంజూదే.
విండీస్పై అజేయంగా 97* పరుగులతో భారత్ను విజయతీరాలకు చేర్చిన శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. T20 WCలో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ రోహిత్(92) పేరిట ఉండగా.. తర్వాతి స్థానంలో కోహ్లీ(89*) ఉన్నాడు. ఈ లిస్ట్ అగ్రస్థానంలో ఉన్న రైనా(2010లో 101 vs SA).. T20 WC సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
విండీస్ నిర్దేశించిన 196 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. T20 WC లక్ష్య ఛేదనల్లో టీమిండియాకు ఇదే(199/5) అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కాగా గతంలో ఈ రికార్డ్ 176/4(2014లో vs SA)గా ఉండేది. ఒవరాల్గా టోర్నీలో చరిత్రలో 230(2016లో ENG vs SA), 206(2007లో SA vs WI) తర్వాత ఇది మూడో హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ ఛేజ్.