టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిపై ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ ఆటతీరు బౌలర్ను మానసికంగా దెబ్బతీస్తుంది. ఒక బ్యాటర్ బలాన్ని ఉపయోగించి స్లాగ్ షాట్తో సిక్స్ కొడితే నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కోహ్లీలా టెక్నిక్తో గ్యాప్ల ద్వారా బంతిని బౌండరీకి పంపితే అది నన్ను బాధిస్తుంది’ అని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. ‘శాంసన్ 14 ఏళ్ల వయసులో తిరువనంతపురంలోని ఒక క్లబ్ తరపున ఆడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి నేను అతని కెరీర్ను నిశితంగా గమనిస్తున్నాను’ అని థరూర్ తెలిపారు. సంజూకు తాను వీరాభిమానినని ఆయన పేర్కొన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సంజుకు జట్టులో ఎప్పుడూ సుదీర్ఘమైన అవకాశాలు లభించలేదన్నారు.
ICC తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో మంధాన చేసిన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 790 రేటింగ్ పాయింట్లతో స్మృతి నెం.1 ర్యాంక్లో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (782)ను రెండో స్థానంలో నిలిచింది.
అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక సూచనలు చేశాడు. అభిషేక్ షాట్ సెలక్షన్పై దృష్టి పెట్టాలని తివారీ సూచించాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకోవద్దని హెచ్చరించాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. సెమీస్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని ఆకాంక్షించాడు.
సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ సుమారు రూ.80-90 కోట్లు ఉంది. IPL ఒప్పందం ద్వారా ఏడాదికి రూ.14 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్టుతో ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. క్రికెట్ మైదానంలోనే కాకుండా, ఆర్థికంగా కూడా సంజూ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా దూసుకుపోతున్నాడని నివేదికలు చెబుతున్నాయి.
సెమీఫైనల్ మ్యాచ్లకు ICC మ్యాచ్ రిఫరీలను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్కు రిఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక IND-ENG సెమీస్కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్, ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్లు వ్యవహరించనున్నారు.
టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, డ్యాన్స్కు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. అలాగే మహేష్ బాబు క్లాస్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే కూడా తనకు మక్కువని పేర్కొన్నాడు. మలయాళీ అయినా తెలుగు మాస్ సినిమాలను తాను క్రమం తప్పకుండా చూస్తానని వెల్లడించాడు.
మార్చి 6 నుంచి టీమిండియా మహిళల జట్టుతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరగనుంది.AUS XI: అలీస్సా హీలీ (C), డార్సీ బ్రౌన్, గార్డ్నర్, హామిల్టన్, బెత్ మూనీ, మైట్లాన్, అలానా కింగ్, లిచ్ఫీల్డ్, మెక్గ్రాత్, ఎలీస్ పెర్రీ, అన్నాబెల్, జార్జియా వోల్, వారెహామ్.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. టీమిండియా సరైన క్రికెట్ ఆడటం లేదని.. ఫీల్డింగ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత ప్లేయర్లు కనీసం 4 క్యాచ్లు వదిలేశారని అన్నాడు. బంతిని ఆపే క్రమంలో తడబాటుకు గురయ్యారని చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై సరైన ప్రదర్శన చేయలేడని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వెస్టిండీస్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వారు భారత్లోనే ఉన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అంతరాయమే దీనికి కారణం. ప్లేయర్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీతో కలిసి పనిచేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జింబాబ్వే జట్టు కూడా భారత్లో చిక్కుకుంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టినట్లు సింధు తాజాగా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
భారత ఫార్ములావన్ యువ కెరటం అతిక మీర్ మరో రికార్డు సృష్టించింది. COTFA కార్టింగ్ సిరీస్ ఐరోపా అంచెలో అతిక మూడో స్థానంలో నిలిచింది. COTFA రేసులో పోడియంపై నిలిచిన తొలి భారత రేసర్గా అతిక ఘనత సాధించింది. ఎఫ్-1 అకాడమీ మద్దతు ఇస్తున్న తొలి భారత రేసర్ అయిన అతిక.. గత కొన్ని నెలలుగా ట్రాక్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది.
దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమిండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటోను ‘X’లో పోస్ట్ చేశాడు. కాగా అంతకుముందు యాంకర్ రష్మి సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేస...
టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్పై సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. శాంసన్ ఒక అద్భుతమైన ఆటగాడని ఆయన ప్రశంసించాడు. వైట్ బాల్ క్రికెట్లో భారత్ తరపున సంజూ నిలకడగా అవకాశాలు పొందాలని అభిప్రాయపడ్డాడు. అతడు ఒకసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు భారీ నష్టం చేకూర్చగలడని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం అతనిలోని గొప్ప లక్షణమని కొనియాడాడు.
పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ టీమిండియాపై తన విమర్శలను ఆపడం లేదు. ఇప్పటికే భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. తాజాగా వెస్టిండీస్పై భారత్ ‘తొండాట’తో గెలిచిందని సంచలన ఆరోపణలు చేశాడు. హెట్మైర్ అవుట్ కాకపోయినా అంపైర్లు ఔట్ ఇచ్చారని వ్యాఖ్యానించాడు. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.