• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IND vs ENG: హెడ్-టు-హెడ్ రికార్డు

T20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు భారత్‌కు స్వల్పంగా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు T20 WCలో మొత్తం 5 సార్లు తలపడగా.. భారత్ 3 సార్లు, ఇంగ్లండ్ 2 సార్లు విజయం సాధించాయి. వాంఖడే స్టేడియంలో ఈ జట్లు టీ20ల్లో రెండుసార్లు తలపడగా, చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.

March 2, 2026 / 08:48 PM IST

దుబాయ్‌లో చిక్కుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో యుద్ధం ప్రారంభం కావడంతో విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. దీంతో అక్కడే చిక్కుకుని పోయామని బెయిర్‌స్టో స్వయంగా పేర్కొన్నాడు.

March 2, 2026 / 08:16 PM IST

యువ క్రికెటర్ల కోసం బీసీసీఐ ‘స్పెషల్ క్యాంప్స్’

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భారత మాజీ దిగ్గజ క్రికెటర్లతో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లతో VVS లక్ష్మణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ముఖ్యంగా, యువ ఆఫ్‌స్పిన్నర్ల కోసం హర్భజన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించే అవకాశం ఉంది.

March 2, 2026 / 06:16 PM IST

కివీస్‌ను ఓడించి ఫైనల్ చేరుతాం: సఫారీ కోచ్

న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో జరిగే ఈ పోరులో గెలిచి, ఫైనల్‌కు చేరుకుంటామని ఘక్రి ధీమా వ్యక్తం చేశాడు. తమ హోం గ్రౌండ్ లాంటి అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ ఆడి తీరుతామని పేర్కొన్నాడు. కాగా, 2026 T20 WCలో సౌతాఫ్రికా అహ్మదాబాద్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.

March 2, 2026 / 05:40 PM IST

‘ధురంధర్ 2’ ట్రైలర్ రూమర్లకు చెక్

‘ధురంధర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హోలీ సందర్భంగా ఈనెల 5న ట్రైలర్ విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని చిత్ర బృందం తాజాగా ఖండించింది. ట్రైలర్ విడుదలకు ఇంకా సమయం ఉందని పేర్కొంటూ.. త్వరలోనే అధికారికంగా తేదీని వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

March 2, 2026 / 05:24 PM IST

చరిత్ర సృష్టించిన టీమిండియా

ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంతో ఈ ఘనత సాధించింది. ODI WC – 8 సార్లు, T20 WC – 6 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు సెమీస్ చేరుకుంది. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి.

March 2, 2026 / 05:16 PM IST

‘ఇంపాక్ట్‌ ప్లేయర్’గా బుమ్రా

వెస్టిండీస్‌పై గెలిచి టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చే ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సంజూ శాంసన్‌ను కాదని బుమ్రా దక్కించుకోవడం విశేషం. ఒకే ఓవర్‌లో ప్రమాదకర బ్యాటర్లు హెట్మెయెర్, ఛేజ్‌లను ఔట్ చేసి బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అందుకే అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేశామని మేనేజ్మెంట్ పేర్కొంది.

March 2, 2026 / 05:00 PM IST

T20 WCలో రేపే తొలి సెమీఫైనల్

T20 WCలో రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

T20 WC తొలి సెమీఫైనల్: SA vs NZ

T20 WCలో ఈనెల 4న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

పాక్ ఆటగాళ్లకు PCB భారీ జరిమానా

T20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. టోర్నీలో జట్టు వైఫల్యానికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. ఆటగాళ్ల అసమర్థత వల్లే జట్టు సెమీస్ చేరలేకపోయిందని బోర్డు భావిస్తుంది.

March 2, 2026 / 03:26 PM IST

కోహ్లీ ఇన్నింగ్స్ ఒక అద్భుతం: రోహిత్

2022 T20 WCలో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లలో ఒకటి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ తాజాగా కొనియాడాడు. ‘2022 MCGలో పాక్‌పై కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మనం గెలిచే స్థితిలో ఏమాత్రం లేము. కానీ విరాట్ అసాధారణ రీతిలో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు’ అని పేర్కొన్నాడు.

March 2, 2026 / 03:03 PM IST

IND vs ENG: వర్షంతో సెమీస్ రద్దయితే?

IND-ENG మధ్య 5న T20 WC సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికి ఈ పోరుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం పడితే నాకౌట్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉంటుంది. ఆ రోజూ ఫలితం రాకపోతే.. సూపర్-8 దశలో మెరుగైన స్థానం కలిగిన ENG ఫైనల్‌కు చేరుతుంది. SA-NZ తొలి సెమీస్‌కూ ఇదే పరిస్థితి. రిజర్వ్ డేలో ఫలితం రాకుంటే సఫారీలు తుదిపోరుకు వెళ్తారు.

March 2, 2026 / 02:48 PM IST

దూబే రెండు ఫోర్లు కీలకం: బుమ్రా

వెస్టిండీస్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. సంజూ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడని పేర్కొన్నాడు. అయితే, చివర్లో దూబే కొట్టిన రెండు ఫోర్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు. ఆ రెండు ఫోర్లే చివరి ఓవర్లో సంజూపై ఒత్తిడిని తగ్గించాయని స్పష్టం చేశాడు.

March 2, 2026 / 02:33 PM IST

IND vs ENG: వరుసగా మూడో సెమీస్

T20 WCలో భాగంగా 5న భారత్-ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. సెమీస్ పోరులో ఇరుజట్లు ఢీకొనడం ఇది వరుసగా మూడోసారి. 2022లో తొలిసారిగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్‌ను చిత్తుచేయగా.. గత టోర్నీలో ప్రత్యర్థిని టీమిండియా 68 పరుగుల తేడాతో ఓడించింది. నాటి 2 టోర్నీల్లోనూ జట్లను రోహిత్-బట్లర్ నడిపించగా.. ఈ సారి సూర్య-బ్రూక్ బరిలోకి దిగారు.

March 2, 2026 / 02:24 PM IST

‘అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసంతో కనిపించట్లేదు’

T20 WC వేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ తనకు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఆడిన జట్ల కంటే సెమీస్‌లో తలపడే ఇంగ్లండ్ వేరే సవాల్ అని, వాళ్ల దగ్గర జాక్స్ వంటి ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే అభిషేక్‌ని సెమీస్ జట్టు నుంచి తప్పించకూడదని, అతను ఆటపై ఫోకస్ పెడితే చాలని కుంబ్లే సూచించాడు.

March 2, 2026 / 01:42 PM IST