HCA ఆధ్వర్యంలో తెలంగాణ T20 లీగ్ను నిర్వహించబోతున్నారు. పార్క్ హయత్ వేదికగా జరిగిన కార్యక్రమంలో జస్టిస్ నవీన్ రావు, క్రికెటర్ అంబటి రాయుడు, డీజీపీ సీవీ ఆనంద్ కలిసి ఈ లీగ్ లోగోను ఆవిష్కరించారు. జూన్, జూలై నెలల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా IPL తరహాలో జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్లు పాల్గొనబోతున్నాయి. ఈ జట్లను దక్కించుకోవడం కోసం 40 ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.