ఐపీఎల్లో భాగంగా రేపు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న RCB, ఈ మ్యాచ్లో గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. మరోవైపు GT తమ సొంతగడ్డపై RCBని చిత్తు చేసి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.