రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఇ-సిగరెట్ తాగినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ అధికారి.. పరాగ్ నుంచి ఇప్పటికే వివరణ కోరినట్లు తెలిపారు. అతడు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.