రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగులు(కేవలం 167 బంతుల్లోనే) పూర్తి చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఆండ్రీ రసెల్ (188 బంతులు), అభిషేక్ శర్మ (195 బంతులు) వంటి విధ్వంసకర ఆటగాళ్ల రికార్డులను అధిగమించాడు.