చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మధ్య ‘డూ ఆర్ డై’ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన భారత్కు, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. ఓడితే భారత్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
వెస్టిండీస్పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.
వెస్టిండీస్పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికెల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, డ్యూ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా ఉండటం కోసం స్టేడియం సిబ్బంది.. ‘డ్యూ కూర్’ అనే రసాయనాన్ని మైదానంలో స్ప్రే చేశారు. ఈ కెమికల్ను అమెరికా నుంచి తెప్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫీల్డింగ్ టీమ్కు డ్యూతో ఇబ్బంది ఉండదు.
వెస్టిండీస్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో విండీస్ ప్లేయర్లు హోల్డర్(49), షెపర్డ్(52*) 8వ వికెట్కు 89 పరుగులు జోడించారు. దీంతో T20Iల్లో 8వ వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన ICC ఫుల్ మెంబర్ టీమ్గా WI రికార్డు సృష్టించింది. అదేవిధంగా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధికంగా 93 పరుగులు చేసిన జట్టుగా కూడా నిలిచింది.
T20 క్రికెట్లో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 విజయాలతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జింబాబ్వే కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు జరిగే మ్యాచ్లోనూ భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే, సంచలన ప్రదర్శనతో S-8కు చేరుకున్న జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 176/8 పరుగులు చేసింది. 10.2 ఓవర్లలో కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ జట్టును.. హోల్డర్(49), షెపర్డ్(52*) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు కేవలం 57 బంతుల్లోనే 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబడ, బాష్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టార్గెట్: 177.
రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదాడు. స్టార్ ప్లేయర్లు రాహుల్(13), పడిక్కల్(11), కరుణ్ నాయర్(0) విఫలమైనప్పటికీ అగర్వాల్ 110 పరుగులతో ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రంజీల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్(584) తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కర్నాటక(174/5) మరో 410 పరుగులు వెనుకబడి ఉంది.
జింబాబ్వేతో ఇవాళ జరగబోయే కీలక మ్యాచ్లో భారత్ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తుది జట్టు అంచనా: అభిషేక, శాంసన్, ఇషాన్, సూర్య, దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, చక్రవర్తి, బుమ్రా, అర్ష్దీప్
వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వెస్టిండీస్ 8.2 ఓవర్లలో కేవలం 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రబడ 2, లుంగి ఎన్గిడి 3 పడగొట్టారు. ప్రస్తుతం హోలర్డ్(9), ఫోర్డ్(1) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ప్రదర్శనతో భారత అభిమానుల్లో సెమీస్ ఆశలు చిగురిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. రంజీ ఫైనల్లో నిన్న కర్ణాటక ఫీల్డర్ అనీశ్ను పారస్ హెల్మెట్తో ఢీకొట్టాడు. ఈ ఘటనపై తాజాగా మ్యాచ్ రిఫరీ నారయణ్ స్పందిస్తూ.. JK సారథి డోగ్రాకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా, ఈ మ్యచ్లో JK తొలి ఇన్నింగ్స్లో 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను LSG నియమించుకుంది. అభయ్ శర్మ 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేశాడు. భారత్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 89 మ్యాచ్లు ఆడి 4105 పరుగులు చేశాడు.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించదని అభిప్రాయపడ్డాడు. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్లో విండీస్తో జరిగిన 5 మ్యాచ్ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.