265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్, ప్రియాంష్ ఆర్య సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో PBKS 2.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఆకిబ్ నబీ వేసిన నాలుగో ఓవర్లో ఈ జోడీ 4 సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆ ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. కాగా, ఈ జోడీ చెరో 5 సిక్సర్లతో 10 సిక్సర్లు బాదారు.